IMAGE STORIES
రిక్టర్ స్కేల్
భూకంప తరంగాల తీవ్రతను రిక్టర్ ప్రమాణం(Richter scale) ఆధారంగా కొలుస్తారు. వివిధ బిందువులు గా గుర్తించబడిన ఈ ప్రమాణం లో ప్రతి ఏకాంకము క్రిందటి ఏకాంకము సూచించు శక్తి కంటే౩౦
రెట్లు అధిక శక్తిని విడుదల చేసినట్లుగా గుర్తిస్తారు. ఉదాహరణకు ఈ ప్రమాణంలోని రెండు , మనం భౌతికంగా గుర్తించ లేని తక్కువ భూకంప తీవ్రత ను సూచించగా ఈ ప్రమాణంలోని ఏడు , ఒక విశాలమైన ప్రాంతాన్ని వినాశనం చేయగల భూకంప తీవ్రతను సూచిస్తుంది.థగ్గులు
18-19 శతాబ్దాలలో ఇండియాలో థగ్గులు తమ ప్రభావాన్ని చూపారు. వీరిలో హిందువులు-ముస్లింలు ఉండేవారు. కాళికాదేవిని కొలిచేవారు. మణికట్టుకు పసుపురంగు రుమాల్ను కట్టుకునేవారు. ఒకవైపు నాణెం ముడివేస్తారు. తాము లక్ష్యంగా చేసుకున్న వారిని, అదను చూసి ఆ వస్త్రంతో చంపేసేవారు. చుక్క నెత్తురు చిందదు! ‘కాళికాదేవి రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు నేలపై పడ్డ ప్రతి నెత్తురు చుక్కా మరో రాక్షసునిగా మారిందిట. ఆ సందర్భంలో దేవి సృష్టించిన ఇద్దరు వ్యక్తులు, దస్తీలతో ఒక్క నెత్తుటి బొట్టు కిందపడకుండా చూశారు. దేవతకు విజయం చేకూర్చారు. వారి వారసులే తామ’ని థగ్గుల నమ్మకం! బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ (1828-35) లార్డ్ విలియం బెంటింగ్.. అమానుషకాండలకు పాల్పడుతున్న థగ్గులపై వేటు వేశాడు. వారి తంతును నిషేధించాడు. స్లీమన్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారికి థగ్గుల నిర్మూలనా బాధ్యతలు అప్పగించాడు. మూర్హౌస్ జాఫ్రే నివేదిక ప్రకారం ఐదేళ్లలో 3,000 మంది థగ్గులు శిక్షకు గురయ్యారు. అమీర్ అలీ అనే థగ్గు కూడా శిక్షకుగురైన వాడే! మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో చెలరేగిన ఒకానొక థగ్గు బృందంలో అమీర్ అలీ సభ్యుడు. అతను అప్రూవర్గా మారి ఉరిశిక్షను తప్పించుకున్నాడు. అప్పటికి అతడి వయసు సుమారు నలభై ఏళ్లు. తాము పట్టుబడితే నేరం అంగీకరించడం కూడా కాళికాదేవి అభిమతమే అని భావించేవారు. 719 మందిని హత్యచేసిన అమీర్ అలీ పన్నెండు నెలలు జైలులో ఉన్నాడు. ఈ కాలాన్ని కూడా లెక్కవేసుకుంటే, ఈ హత్యల సంఖ్య వేయికి చేరేద న్నాడు. ‘అమీర్ అలీ కన్ఫెషన్స్’ 1839లో తొలిసారి ఇంగ్లండ్లో ప్రచురించారు.CLICK HERE చరిత్ర చెప్పని థగ్గుల కథ.